Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

0 12

తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ ఉద్యోగుల సంఘంఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ డైరీ 2024 ని తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రొ. కోదండరామ్, డి. సుధాకర్ (మాజీ మెంబర్ ఏపీపీఎస్సీ) ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ ఎ.పద్మాదారి అధ్యక్షత వహించగా అధ్యక్షులు మరం రవీందర్ కుమార్ ఆహ్వానంతో అట్టహాసంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలంగాణ డైరీని ఆవిష్కరించి, సంఘ సభ్యులందరికీ డైరీని అందజేశారు.

ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ సి. హెచ్. హరీష్ కుమార్ రెడ్డి, వి.సురేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, కృష్ణమూర్తి డైరీ కమిటీ చైర్మస్, ఎస్. శ్రీనివాస్, ఫైనాన్స్ సెక్రెటరీ, జక్కోజు వెంకటేష్, వి. కృష్ణ, ఎస్. నర్సింగ్ రావ్, సిటీ ప్రసిడెంట్, డా. శంకర్ భూక్యా, డా. షరీఫ్, జీ.పద్మా తో పాటు, వివిధ జిల్లా మరియు వివిధ శాఖాధిపతుల అధ్యక్ష, కార్యదర్శులు మరియు సచివాలయ ఉద్యోగులు ,తెలంగాణ ఉద్యోగ సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking