Take a fresh look at your lifestyle.

ఆర్టీసీలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేసిన  మంత్రి పొన్నం

0 11

ఆర్టీసీలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేసిన  మంత్రి పొన్నం

ఆర్టీసీ ఉత్తమ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అవార్డులను ప్రదానం చేసారు.మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి రాగానే ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీం మహాలక్ష్మి . ఆర్టీసీ సిబ్బంది వల్లే  మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలు అవుతుంది. సంస్థ అభివృద్ధి కోసం కష్టపడ్డ వారికి అవార్డులను ఇవ్వడం సంతోషంగా ఉంది. బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలు కూడా ప్యాసింజర్లే. వారిని కూడా పురుషలతో సమానంగా సిబ్బంది గౌరవించాలి. మహిళల తరపున టికెట్ డబ్బులను ప్రభుత్వం చెల్లిస్తుంది. మహాలక్ష్మి పథకంతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల పాట పట్టింది. ఎంత మంది మహిళలు ప్రయాణిస్తే అంత చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే నెలకు 300కోట్ల కంటే ఎక్కువ ప్రభుత్వం చెల్లిస్తుంది. త్వరలో కొత్త బస్సులు, ఉద్యోగ నియామకాలు చేపడతాం. ఆర్టీసీ ఉద్యోగులు పెండింగ్ బిల్స్ ను త్వరలో ప్రభుత్వం విడుదల చేస్తుందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking