Take a fresh look at your lifestyle.

హైదరాబాద్ చేరుకున్న మాయవతి

0 15

మాయవతికి స్వాగతం పలికిన బిఎస్ పి నాయకులు

హైదరాబాద్, మే 6 : హైదరాబాద్ చేరుకున్నారు బిఎస్పి జాతీయ అధ్యక్షురాలు బెహన్ జీ కుమారి మాయవతి. 7వ తేదీన హైదరాబాద్ లో జరిగే తెలంగాన నిరుద్యోగుల భరోసా సభలో ఆమె పాల్గొంటారు. అయితే.. బేగంపేట ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం  పలికిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బిఎస్ పి నాయకులు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి రాజ్యసభ ఎంపి రాంజీ గౌతమ్ గారు, రాష్ట్ర ఛీఫ్ కో ఆర్డినేటర్ మంద ప్రభాకర్, చంద్రశేఖర్ ముదిరాజ్ తదితరులు మాయవతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు బహుజన్ సమాజ్ పార్టీ కార్యక్రమాల వివరాల గురించి రాష్ట్ర అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులతో చర్చించారు మాయవతి. బిఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తో రాష్ట్ర రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking