Take a fresh look at your lifestyle.

21మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

0 317

మల్టీ జోన్ వన్ పరిధిలో

పనిచేస్తున్న సీఐల బదిలీ

హైదరాబాద్ : మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 21మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజి పి.చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాజీపేటలో పనిచేస్తున్న జి.మహేందర్ రెడ్డిని మందమర్రి సర్కిల్ కు, భూపాలపల్లి సిసిఎస్ లో పనిచేస్తున్న వాసుదేవరావును చెన్నూరుకు, చెన్నూరులో పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ ను శ్రీరాంపూర్ మహిళా పోలీస్ స్టేషన్ కు, నిజామాబాద్ ఎస్ బీలో పనిచేస్తున్న శ్రీహరిని ఖానాపూర్ కు, కొత్తగూడెం డీఎస్పీలో పనిచేస్తున్న స్వామిని ఖమ్మం ఒకటవ పోలీస్ స్టేషన్ కు, కొత్తగూడెం ఒకటో పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సత్యనారాయణను ఖమ్మం మూడవ పోలీస్ స్టేషన్ కు, భూపాలపల్లిలో పనిచేస్తున్న రాజిరెడ్డిని ఖమ్మం రూరల్ కు, కొత్తగూడెం డిసిఆర్ బి లో పనిచేస్తున్న వేణుచందర్ ను చిట్యాల సర్కిల్ కు, మందమర్రిలో పనిచేస్తున్న ప్రమోదరావును గోదావరిఖని వన్ టౌన్ కు బదిలీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking