Take a fresh look at your lifestyle.

టిప్పర్ బోల్తా…ముగ్గురు మృతి

0 13

టిప్పర్ బోల్తా…ముగ్గురు మృతి
మృతుల్లో అన్నాచెల్లెలు
కరీంనగర్

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి గ్రామ మూల మలుపు వద్ద గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొన్న ఈ ముగ్గురు గంట వర్ష(15) గంట విజయ్(17) గంట సింధుజ (18) ద్విచక్ర వాహనం పై ఇండ్లకు వెళ్తున్న క్రమంలో ఎలబోతారం నుంచి హుజురాబాద్ వైపు వస్తున్న మొరం మట్టితో కూడిన టిప్పర్ లారీ అతివేగంగా నడుపుతు మూలమలుపు వద్ద ఒక్కసారిగా బ్రేక్ వేయడం తో టిప్పర్ బోల్తా పడింది.

టిప్పర్ వస్తున్న విషయాన్ని గమనించి పక్కనే ఆపిన బైక్ పై టిప్పర్ బోల్తా పడింది దీంతో బైక్ పై ఉన్న ముగ్గురి లో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా మరొకరిని ఆసుపత్రి కి తరలించేటప్పుడు మృతి చెందారు. విషయం తెలిసిన స్థానికులు జేసిబి సహాయం తో మృత దేహాలను బయటికి తీశారు. మృతుల్లో విజయ్, వర్ష ఇద్దరు సొంత అన్నా చెల్లెలు. సమాచారం అందుకున్న మృతుల కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking