Take a fresh look at your lifestyle.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

0 46

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకుల మృతి

విశాఖపట్నం : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకోజిపాలెం కూడలి దగ్గర బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకుల్ని ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హనుమంతు వాక నుంచి మద్దిలపాలెం వైపు వెళుతున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. మృతదేహాలు కేజీహెచ్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సాయి, దుర్గా ప్రసాద్, గోపీలుగా గుర్తించారు. పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా బైక్‌ను ఢీకొట్టిన వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking