Take a fresh look at your lifestyle.

ఆ విలేకరులను క్షేమించలేం..

0 12

ఆ విలేకరులను క్షేమించలేం..
నిర్దేశం, రంగారెడ్డి :
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని టంగుటూరు గ్రామంలో గొలుసు కట్టు మనీ స్కీమ్ కు ఒక కుటుంబం బలైన సంఘటనలో కొంతమంది విలేకరుల పాత్ర ఉండటం అత్యంత విచారకరమని తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ)లు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వ్యాఖ్యానించాయి.
వాస్తవాలను రాయకుండా ఉండడానికి ఒక వ్యక్తి వద్ద డబ్బులు డిమాండ్ చేసిన విలేకరులు వృత్తికి ద్రోహం చేయడమే గాకుండా ఆ క్రమంలో నలుగురి ప్రాణాలు పోవడానికి కారకులు అయ్యారని, ఈ ఘటన మీడియాలోని ప్రతి ఒక్కరూ తలదించుకునేలా చేసిందని టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
మీడియాలో నానాటికీ దిగజారుతున్న నైతిక విలువలకు ఉదాహరణగా నిలుస్తున్న ఈ ఘటన అందరికీ కనువిప్పు కలిగించాలని వారు వ్యాఖ్యానించారు. ఈ ఘటన నేపథ్యంలో మీడియాలోని ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా మీడియా సంస్థల యాజమాన్యాలు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. మీడియా ప్రమాణాలను, గౌరవాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టియుడబ్ల్యూజే, ఐజేయూ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking