Take a fresh look at your lifestyle.

ఉద్యమ జర్నలిస్టుల సంఘం లోగో ఆవిష్కరించిన సీఎం

0 12

ఉద్యమ జర్నలిస్టుల సంఘంకు సహాయం చేస్తాం

: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్‌) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం గత ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు, నూతన ఉత్తేజంతో యువ జర్నలిసులను కూడా కలుపుకొని పోయేందుకు కృషి చేస్తున్నట్లు టియూజెఎస్‌ కన్వీనర్‌ ఎం.ఎం.రహమాన్‌ తెలిపారు.

ముఖ్యమంత్రి తమ విజ్ఞప్తికి స్పందించి లోగో ఆవిష్కరిస్తూ ఈ సంఘాన్ని అత్యున్నత ప్రాధాన్యతలో గుర్తించాలని, అక్కడికక్కడే సమాచార శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసినందుకు సీఎంకు రహమాన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, సీఎవఓం చీఫ్‌ పిఆర్‌ఓ అయోధ్యరెడ్డిలకు, సంఘం నేతలు ధన్యావాదాలు తెలిపారు.

ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేసిన జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి రోజులు వస్తున్నయన్నారు జర్నలిస్టు ఉద్యమ కారులు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ సంఘం నేతలు మునీర్‌, కందుకూరి రమేష్‌బాబు, యాటకర్ల మల్లేష్‌, పసూనూరి రవీందర్‌, తాటికొండ రమేష్‌బాబు, సాధిక్‌, ఖాజీపేట నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking