Take a fresh look at your lifestyle.

ఎంఐఎం కు ఈసారి ప్రజలు బుద్ది చెబుతారు –  ఎంపి డా. లక్ష్మణ్

0 15

ఎంఐఎం కు ఈసారి ప్రజలు బుద్ది చెబుతారు
–  ఎంపి డా. లక్ష్మణ్
మోది నీ మూడో సరి ప్రధాని చేయడానికి మద్దతుగా ఈ విజయ సంకల్ప యాత్ర చేపట్టామని బీజేపీ ఎంపి డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన చార్మినార్ లోని భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు జరిపారు. లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రం లోని అన్ని పార్లమెంట్ స్థానాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. తొమ్మిది పార్లమెంట్ స్థానాల్లో యాత్ర పూర్తి చేసుకుని ఈరోజు ఇక్కడికి చేరుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ ఊహా రచన చేస్తుంది. ఎంఐఎం కంచుకోటగా చెప్పుకుంటున్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈ సారి బిజెపి కైవసం చేసుకుంటుంది. కేవలం బడా వ్యాపారులకు కొమ్ము కాస్తూ.. పేద ప్రజలను పట్టించుకోని ఎంఐఎం కి ఈ సారి ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు.
కాంగ్రెస్ కూడా హామీల అమలు విషయంలో మాట మారుస్తుంది. ఓడ దాటే వరకు ఓడ మల్లయ్య ఓడ దాటిన తరువాత బోడ మల్లయ్య అన్నట్లు ఉంది కాంగ్రెస్ ది. మొదటగా అందరికీ ఆరు గ్యారెంటీ లు అని చెప్పి.. ఇప్పుడేమో కండీషన్లు అంటుంది. ఎన్నికల ముందు అందరికీ 500 వందల గ్యాస్ సిలిండర్ అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొంత మందికి మాత్రమే అని కండిషన్స్ చెబుతున్నారు. మన రాష్ట్రం లో తెలంగాణ 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేవలం 40 లక్షల మందికే సిలిండర్ ఇస్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ పథకాలు ప్రారంభిస్తున్నారు.. ఎన్నికల తరువాత అమలు చేస్తారనే నమ్మకం లేదు. ఫ్రీ బస్ అంటూ పబ్లిసిటీ చేసి డీలక్స్ కి డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking