Take a fresh look at your lifestyle.

మంత్రి కొండా సురేఖ హృదయం..

0 18

మంత్రి కొండా సురేఖ హృదయం..

మంత్రి కొండా సురేఖ మరోసారి తన మానవీయ హృదయాన్ని చాటుకున్నారు. సచివాలయంలో సోమవారం రాత్రి తన రోజువారి షెడ్యూల్ ను ముగించుకొని ఔట్ డోర్ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరుతుండగా తన కోసం రైసా బేగం అనే ముసలావిడ తన కొడుకు సమీర్ తో కలిసి వేచి చూస్తున్న విషయాన్ని తెలుసుకొని, తన ఛాంబర్ లోకి పిలిపించుకొని మాట్లాడారు. హృదయవిదారకమైన తన పరిస్థితిని తెలుసుకొని, ఆవిడ చెప్పిన విషయాలను సావధానంగా విని, అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సమస్యను పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులను ఫోన్ లో అప్పటికప్పుడే ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking