Take a fresh look at your lifestyle.

మావోయిస్టు డబ్బులతో పరారీ.. నక్సలైట్ చంద్రన్నను నమ్మొద్దు.. : మావోయిస్టు నేత వెంకటేష్

0 17

మావోయిస్టు డబ్బులతో పరారీ..
నక్సలైట్ చంద్రన్నను నమ్మొద్దు.. : మావోయిస్టు నేత వెంకటేష్
నిర్దేశం, హైదరాబాద్ :
అతను నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం పని చేశారు. పోలీసు నిర్బందంను ఎదుర్కొని ఉద్యమంలో పని చేశారు. 37 ఏళ్లుగా విప్లవోద్యమంలో తుపాకి పట్టుకుని పోరాటం చేసిన మావోయిస్టు నేత చంద్రన్న అలియాస్ బంధారపు మల్లయ్య పార్టీ డబ్బులతో పారి పోయారని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు జే ఎం డబ్ల్యు పి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ మీడియాకు పంపిన లేఖలో పేర్కొన్నారు.
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట గ్రామానికి చెందిన బందారపు మల్లయ్య అలియాస్ చంద్రన్న 1986-87 మధ్యలో గత పీపుల్స్ వార్ పార్టీలోకి రిక్రూట్ అయ్యాడు. అప్పటినుండి మంథని ఏరియాలో చంద్రన్న పేరుతో దళ సభ్యుడి నుండి కమాండర్ గా జిల్లా కమిటీ మెంబర్ గా పనిచేసినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మంథని ఏరియాలో పనిచేస్తున్న క్రమంలో భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలన్నింటికీ ఆయన నాయకత్వం వహించినట్లు గుర్తు చేశారు.
అయితే.. పెరిగిన పోలీసు నిర్బందంతో ఉద్యమ అవసరాల రీత్యా 2003లో దండకారణ్యానికి బదిలీ అయి గడిచిరోలి లో జిల్లా కమిటీ మెంబర్గా జిల్లా కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. పార్టీలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎన్నో కష్టనష్టాలు కోర్చి నిర్భందాన్ని ఎదుర్కొని విప్లవ నిబద్ధతతో పనిచేసినట్టు తెలిపారు. నక్సలైట్ ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగిన చంద్రన్న ఉద్యమంలో వస్తున్న ఎగుడు దిగుడులను, మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోలేక నిర్బంధం పెరిగి దాడులు జరగడంతో ప్రాణభయంతో విప్లవ ప్రజలకు ద్రోహం చేసి డబ్బులు ఎత్తుకొని పారిపోయాడని ఆయన పేర్కొన్నారు. ఇకముందు బంగారపు మల్లయ్యను విప్లవ ప్రజలు అమరవీరులు, కుటుంబాలు ఎవరు నమ్మవద్దని మావోయిస్టు జేయండబ్ల్యుపి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ విజ్ఞప్తి చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking