Take a fresh look at your lifestyle.

సీబీఐకి లేఖ రాసిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి

0 54

సీబీఐకి లేఖ రాసిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి

వైఎస్సార్‌ జిల్లా:  సీబీఐకి కడప ఎంపీ అవినాష్‌రెడ్డి లేఖ రాశారు. ఈ రోజు విచారణకు హాజరవుతున్నానని తెలిపారు. వివేకానందరెడ్డి కేసు ప్రారంభమైన దగ్గరనుంచి నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్నారు అవినాష్ రెడ్డి.

పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందని, తప్పు దోవపట్టించేలా వార్తలను ప్రసారం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన.

అందుకే విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నామని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఆడియో, వీడియో రికార్డింగులకు అనుమతించాలి. తనతోపాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు రెడ్డి.

ఈ విజ్ఞప్తులను సీబీఐ పరిగణలోకి తీసుకోవాలి అని సీబీఐని, ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking