Take a fresh look at your lifestyle.

ఫోన్ ట్యాపింగ్ లో నెక్ట్స్ కేసీఆరా.. కేటీఆరా..?

0 16

ఫోన్ ట్యాపింగ్ లో నెక్ట్స్ కేసీఆరా.. కేటీఆరా..?
– ఎస్ ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నోరు విప్పాల్సిందే..
– ఫోన్ ట్యాపింగ్ లో క్షేత్రస్థాయి విచారణ

(ఈదుల్ల మల్లయ్య)

ఫోన్ ట్యాపింగ్… కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అతి పెద్ద కుంభకోణం.. ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా ఖాకీ డ్రెస్ వేసుకుని గులాబీలకు ఊడిగం చేసారు పోలీసు అధికారులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బీఆర్ ఎస్ పార్టీ కోసం పని చేసిన పోలీసు పెద్దల గుట్టు రట్టు అవుతుంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీసు అధికారులు ఒక్కొక్కరు జైలులో చిప్ప కూడు తింటున్నారు.

ఎస్ ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు నోరు విప్పాల్సిందే

ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీసి బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకు రావడానికి చేసిన పోలీసు అధికారుల గుట్టును సిట్ అధికారులు విప్పుతున్నారు. ఎస్ ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ఎవరెవరి పాత్ర ఎంత వరకు ఉందో ఇప్పటికే నిగ్గు తేల్చారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావును అరెస్టు చేసిన తరువాత సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. అయితే.. బీఆర్ ఎస్ బాస్ చెప్పడం వల్లే తాము ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించారనే టాక్ ఉంది. అయితే.. రాధకిషన్ రావు వాంగ్ములం ద్వారా కేసీఆర్ లేదా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యే అవకాశం ఉందంటున్నారు.

ప్రభాకర్ రావు అరెస్టైతే..

ఫోన్ ట్యాపింగ్ లో అన్నీతానై నడిపిన ఎస్ ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు మెయిన్ పాత్ర పోషించారనేది సిట్ అధికారుల విచారణలో తేలింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే తన పదవికి రాజీనామా చేసిన ప్రభాకర్ రావు చెన్నై మీదుగా అమెరికా పారి పోయిన విషయాన్ని సిట్ అధికారులు గుర్తించారు. విదేశాలకు పారి పోయిన ప్రభాకర్ రావుపై ఎయిర్ పోర్టులకు లూకౌట్ సర్కులర్ (ఎల్ వోసీ) జారీ చేశారు పోలీసులు.

రాధకిషన్ రావు అరెస్టుతో..

టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావును సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఎస్ ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే తాను పని చేశానని రాధకిషన్ రావు సిట్ అధికారుల ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే.. ప్రణీత్ రావు అరెస్టుతో ఉన్నతాధికారుల లింక్ బహిర్గతమైంది. ఆ లింక్ తోనే అడిషనల్ ఎస్ పీ భుజంగరావు, తిరుపతన్నలతో పాటు డీఎస్పీ గట్టు మల్లు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు వరకు వెళ్లి ఆగింది. అమెరికలో ఉన్న ప్రభాకర్ రావును రప్పిస్తేనే బీఆర్ ఎస్ లోని పెద్దల పేర్లు బహిర్గతం అవుతాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ లో మెయిన్ సూత్రదారి కేసీఆర్ లేదా కేటీఆర్ పేరు ప్రభాకర్ రావు నుంచి వెల్లడి అయ్యే అవకాశాలున్నాయంటున్నారు. రేపో.. ఎల్లుండో అమెరికా నుంచి రాగానే సిట్ అధికారులకు లొంగి అన్నీ విషయాలు చెప్పాలని ప్రభాకర్ రావు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking