Take a fresh look at your lifestyle.

కడప జిల్లా చాపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

0 52

కడప జిల్లా చాపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన టెంపో వాహనం.

కడప జిల్లా : కడప జిల్లా చాపాడు వద్ద  శుక్రవారం తెల్లవారుజామున దాదాపు 2 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు.

ప్రొద్దుటూరు పట్టణం వైఎంఆర్ కాలనీకి చెందిన 15 మంది కుటుంబ సభ్యులు తిరుమల కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది అనూష , (30) ఓబులమ్మ ,(40) రాములమ్మ(48) అనే మహిళలు దుర్మరణం చెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking