Take a fresh look at your lifestyle.

ఎన్నికల వేళ.. హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు

0 12

ఎన్నికల వేళ..
హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు
నిర్దేశం, హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకురాలు , బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు గురువారం తెల్లవారు జామున ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5 గంటలకు చేరుకుని పారిజాత కూతురి ఫోన్ స్వాధీనం చేసుకుని అధికారులు సోదాలు జరిపారు. పారిజాత తిరుపతి లో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు.బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి, మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి కేఎల్ఆర్ ఇంట్లో కుడా ఐటీ సోదాలు జరిగాయి. హైదరాబాద్ లో జరుగుతున్న ఐటీ దాడులకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking