Take a fresh look at your lifestyle.

జర్నలిస్టు శంకర్ పై దాడికి ఖండన దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

0 17

జర్నలిస్టు శంకర్ పై దాడికి ఖండన
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
– టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్

నిర్దేశం, హైదరాబాద్ :

న్యూస్ లైన్ ఛానెల్ ఎడిటర్, జర్నలిస్టు శంకర్ పై జరిగిన దాడిని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే ఒక జర్నలిస్టుపై అర్ధరాత్రి 15 మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా దాడి చేయటం సరైంది కాదని, ఈ భౌతిక దాడులను టీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య తెలిపారు. శంకర్ పై దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేయాలని వారు ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking