Take a fresh look at your lifestyle.

రామోజీ నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు

0 14

జూబ్లీహిల్స్ లోని రామోజీ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు

హైదరాబాద్, జూన్ 7 : మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో భాగంగా జూబ్లీహిల్స్లో రామోజీ రావు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు మంగళవారం వచ్చారు. మార్గదర్శి కేసులో ఎండీ శైలజా కిరణ్ను విచారించినట్లు సమాచారం. చందాదారుల నగదు ఎక్కడికి తరలించారన్న కోణంలో దర్యాప్తు కొనసాగింది. రామోజీ గ్రూప్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు సీఐడీ గుర్తించింది.

మార్గదర్శి సంస్థకు చెందిన ఆస్తులను ఇటీవలే అటాచ్ చేసిన విషయం తెలిసిందే. మార్గదర్శికి సంబంధించిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తుల అటాచ్ అయ్యాయి. మార్గదర్శి చైర్మన్, ఎండీ, ఫోర్ మెన్, ఆడిటర్లు కుట్రకు పాల్పడినట్లు గుర్తించారు. చిట్స్ ద్వారా మార్గదర్శి సేకరించిన సొమ్ము మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టారు.

ఏపీలో 1989 చిట్స్ గ్రూపులు, తెలంగాణలో 2,136 చిట్స్ గ్రూపులు కీలకంగా మారాయి. నగదు ఎక్కడికి మళ్లించారనే కోణంలో ఏపీ సీఐడీ దర్యాప్తు నడుస్తోంది. చందాదారుల ప్రయోజనాలు రక్షించేందుకే ఆస్తుల అటాచ్మెంట్ నిర్ణయం. చిట్ ఫండ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన సీఐడీ, ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే మార్గదర్శిలో బ్రాంచుల్లో సోదాలు జరిపింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking