Take a fresh look at your lifestyle.

రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుడు అరెస్ట్

0 16

రాడిసన్ డ్రగ్స్ కేసులో నిందితుడు అరెస్ట్
నిర్దేశం, హైదరాబాద్ :
డిసన్ హోటల్ కేంద్రంగా సాగిన డ్రగ్స్ సరఫరా కేసులో పోలీసులు పురోగతి సాధించారు.ఇద్దరు కీలక నిందితులు సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్, నరేంద్ర శివనాథ్ ను అదుపులోకి తీసుకున్నారు. రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ సరఫరాపై ఫిబ్రవరి 25న కేసు నమోదైంది. ఈ ఇద్దరూ నిందితులు డ్రగ్స్ సరఫరా చేశారని పోలీసులు గుర్తించారు. రెహ్మాన్ పై 6 కేసులున్నాయి. అతడు 3 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు.తాజాగా రెహ్మాన్ తోపాటు నరేంద్ర శివనాథ్ ను మదాపూర్, గచ్చిబౌలి ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. కోటి విలువైన కారు, 7 ఫోన్లు, 11 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రకటించారు. కొకైన వినియోగించిన వ్యక్తల రక్త నమూనాలను మెడికల్ టెస్టులకు పంపామని తెలిపారు. నిందితులకు క్రొమొటోగ్రఫీ టెస్ట్ చేయించేందుకు కోర్టు పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking