ఎర్త్ అవర్ లో లైట్లు..
నిర్దేశం, హైదరాబాద్ : ఎర్త్ అవర్ పాటించడంలో భాగంగా ఈ గంటపాటు హైదరాబాద్లోని ఐకానిక్ కట్టడాలు చీకటిగా మారేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రడ్జి, హుస్సేన్సాగర్లోని బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఐకానిక్ స్మారక చిహ్నాలు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు లైట్లను ఆపివేయనున్నాయి.పర్యావరణ సమస్యలు, రోజువారీ విద్యుత్ వినియోగ ప్రభావం గురించి అవగాహన పెంచడమే ఎర్త్ అవర్ లక్ష్యంఈ ఉద్యమం వ్యక్తులు, సంస్థలు కమ్యూనిటీలు.. అన్ని అనవసరమైన లైట్లను ఒక గంట పాటు ఆఫ్ చేయమని ప్రోత్సహిస్తుంది. పర్యావరణం పట్ల వారి నిబద్ధతకు, వ్యక్తిగత మార్పుకు సంభావ్యతకు ప్రతీకగా ఈ ఉద్యమం నిలుస్తుంది. ఎర్త్ అవర్ను హైదరాబాద్కే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
Prev Post
Next Post