Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఇస్తాం.. : కాంగ్రెస్ ప్రతినిధి మల్లు రవి

0 15

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల ఇస్తాం..

సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తాం!

– జేఎన్‌జే విస్త్రుత స్థాయి సమావేశంలో పిసిసి సీనియర్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి!

తరపున హమీఇచ్చారు. ప్రతిపక్షంలో వుండగా జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీ సభ్యులకు పిసిసి అధ్యక్షులైన నేటి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి పలుమార్లు టిం జేఎన్‌జే విన్నవించడంతో ఈ అంశంపై సంపూర్ణ అవగాహన ఏర్పడిందని ఆయన తెలిపారు.

గురువారం రవీంద్రభారతిలో టీం జెఎన్‌జే నిర్వహించిన జవహర్‌లాల్‌ నెహ్రూ జర్నలిస్టు మాక్‌ హౌసింగ్‌ సొసైటీ విస్రుతస్థాయి సమావేశంలో మల్లు రవి అతిధిగా పాల్గొని మాట్లాడారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున రాలేని పరిస్థితుల్లో రాష్త్ర రెవిన్యూ, సమాచార శాఖలమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వ్యవసాయ, సహకారశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంపిన తమ సందేశాల్లో జేఎన్‌జే జర్నలిస్టులకు రాష్త్ర ప్రభుత్వం అండగా వుంటుందని, వారికి ఇళ్ళ స్థలాలు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని తెలిపారు.

జర్నలిస్టు సంక్షేమం పట్ల కాంగ్రెస్‌ పార్టీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో హమీ ఇచ్చిన మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో వున్న జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీ సమస్యను పరిష్కరిస్తామని మరోసారి స్పష్టం చేశారు.

గతంలో బంజారా హిల్స్‌, జూబ్లి హిల్స్‌, గోపన్నపల్లిలో జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇచ్చింది కాంగ్రెసేనే అని, ఇప్పుడు కూడా ఇచ్చేది తామేనని మల్లు భరోసా ఇచ్చారు. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం సుప్రీం తీర్పును అమలు చేయకుండా ఆ సొసైటీ సభ్యులపై దిగ్బందాలు విధించి భయబ్రాంతులకు గురిచేసిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు ఏ విధమైన అన్యాయం జరిగినా ఆ సమస్యలపై కోర్టుకు వెళ్తారని, వీటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టులు వాటిని పరిష్కరించాలని తీర్పులు చెబితే వాటిని అమలు చేయకుండా తొక్కిపెట్టడం అప్రజాస్వామికం అన్నారు. జేఎన్‌జే హౌసింగ్‌ సొసైటీకి ఇళ్ల స్థలాలు అప్పగించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన భరోసా మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.

జేఎన్‌జే విస్తుతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన సొసైటీ ఫౌండర్‌ మెంబర్‌ పివి రమణరావు మాట్లాడుతూ 16 ఏళ్లుగా పెండింగ్‌లో వున్న సొసైటీ స్థలాల సమస్యను కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిష్కరిస్తుందని నమ్ముతున్నామన్నారు. ఈ మేరకు పాత మేనేజింగ్‌ కమిటీని పూర్తి స్థాయిలో రద్దు చేసేందుకు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు.
సొసైటీ మేనేజింగ్‌ కమిటీ సభ్యులను భయబ్రాంతులకు గురిచేసి, గత ప్రభుత్వం అండదండలతో అణచివేసారని సొసైటీ సభ్యుడు ఆశోక్‌రెడ్డి అన్నారు. పోలీసుల వేధింపులతో పాటు సొసైటీ సభ్యత్వాలను రద్దుచేస్తామని సభ్యులను బెదిరించారని వాపోయారు.

ఈ కార్య్రకమంలో టీం జేఎన్‌జే సభ్యులు కె.మంజుల, బాలినేని నాగభూషణరావు, బోడపాటి శ్రీనివాసరావు, టాటా శ్రీనివాస్‌, చిత్ర, తాహీర్‌ రుమాని, హసన్‌ షరీఫ్‌, నర్సింగ్‌రాజ్‌, శ్రీచంద్ర, మారేపల్లి లక్ష్మణ్‌ తదితరులు మాట్లాడారు,

Leave A Reply

Your email address will not be published.

Breaking