Take a fresh look at your lifestyle.

శాసన మండిలికి వెళ్లాలా..? స్మశాన వాటికకు వెళ్లాలా..?

0 827

శాసన మండిలికి వెళ్లాలా..?

స్మశాన వాటికకు వెళ్లాలా..?

  • ఓట్ల కోసం తీన్మార్ మల్లన్న ఎత్తుగడ..
  • మల్లన్నను డిస్ క్వాలిఫై చేయాలని ధర్నా..

నిర్దేశం, హైదరాబాద్ :

తీన్మార్ మల్లన్న.. ఈ పేరు చాలా మందికి సుపరిచితమే. యూట్యూబ్ ద్వారా డైలీ పేపరులను విశ్లేషణ చేస్తూ కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు. అంతే.. లక్షలాది మంది యూట్యూబ్ ఫాలోవర్స్ అయ్యారు. జర్నలిస్ట్ ను అంటూ ఫక్త్ రాజకీయాలను మాట్లాడే మల్లన్న ఇప్పుడు ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే.. ఎన్నికలలో పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘‘శాసన మండిలికి వెళ్లాలా..? లేక స్మశాన వాటికకు వెళ్లాలా…? మీరే నిర్ణయించండి అంటూ మాట్లాడిన వీడియో ట్రోల్ అవుతుంది. నీవు స్మశాన వాటికకు వెళ్లితే బాగుంటుంది అని కొందరు పోస్ట్ లు పెడుతున్నారు.  

తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని ధర్నా..

ఖమ్మం కలెక్టరేట్ ఆవరణలో ఎమ్మెల్సీ అభ్యర్ది బక్కా జడ్సన్ ధర్నాకు దిగారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను , ప్రజలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని జడ్సన్ ఆరోపించారు. తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని  ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసారు. అధికారులు స్పందించకపోవడంతో కలెక్టరేట్ లో జడ్సన్ ఆందోళనకు దిగారు. తీన్మార్ మల్లన్నను  డిస్ క్వాలిఫై చేయాలంటూ జడ్సన్ డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking