Take a fresh look at your lifestyle.

మహిళ ల పై చెయ్యి చేసుకున్న యస్.ఐ మహేష్

0 15

మహిళ ల పై చెయ్యి చేసుకున్న యస్.ఐ మహేష్

సామాజిక మాధ్యమాలలో హల్చల్

సూర్యాపేట, మే 28 : అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో విభూలాపురం గ్రామంలో రెండు రోజుల క్రితం ధర్నా చేపట్టారు. ధర్నా చేసిన సిపిఎం నాయకులపై మండల యస్.ఐ మహేష్ చేయి చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. ధర్నా చేస్తున్న ఒక వ్యక్తిని ఎస్ఐ గల్లా పట్టుకొని గుంజి లాగి కింద పడేయడంతో ఆ వ్యక్తి కి గాయాలైనాయి. ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని కొనసాగిస్తుంటే, కొంతమంది పోలీసులు ప్రజల పట్ల అనుసరిస్తున్న విధానం ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి మాయని మచ్చగా మారుతుంది.మోతె మండలంలోని విభులాపురం గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఏళ్ళు గడుస్తున్నా పంపిణీ చేయడం లేదంటూ శుక్రవారం ప్రజలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.ధర్నా కొనసాగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఎస్ఐ ఆవేశంతో ఊగిపోతూ ఒక వ్యక్తిని గల్ల పట్టి గుంజి నేలపై విసిరేసినాడు..అంతే కాకుండా మహిళ ల పై చెయ్యి చేసుకున్నాడు..ఈ వీడియో సూర్యాపేట జిల్లా లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పేద ప్రజలపై ఎస్సె ప్రదర్శించిన తీరుపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు పెద్ద తలనొప్పిగా ఉంది. గతంలో ఈ ఎస్ఐ ని దూకుడు తగ్గించుకోవాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సూచనలు చేసిన ,ఆ ఎస్సె లో ఏలాంటి మార్పు రాకపోవడంతో సర్వత్ర విమర్శలు గుప్పుమంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking