Take a fresh look at your lifestyle.

కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ 15 మంది విద్యార్దినిలు ఆసుపత్రి పాలు

0 13

కేజీబీవీలో ఫుడ్ పాయిజన్
15 మంది విద్యార్దినిలు ఆసుపత్రి పాలు
నిర్మల్ జిల్లా నర్సాపూర్ జి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినిలు మధ్యాహ్నం భోజనం తిన్న 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న విద్యార్తినిలు భోజనం తిన్న తర్వాత యధావిధిగా క్లాసులకు హాజరయ్యారు. సాయంత్రం వంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురికావడంతో 15 మంది విద్యార్థులను నర్సాపూర్ జి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా, మరో ఐదుగురిని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

విద్యార్థినులు అస్వస్థత గురైన విషయాన్ని తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు అస్వస్థత విషయం తమకు ఎందుకు తెలియజేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రి వైద్యురాలు మాట్లాడుతూ విద్యార్థినుల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking