Take a fresh look at your lifestyle.

మహిళా మావోయిస్టును అరెస్టు చేసిన ఎన్‌ఐఏ

0 70

రాయ్‌పూర్‌ : టేకులగూడెం ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న మహిళా మావోయిస్టును ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. చతిస్గడ్ రాష్ట్రం రాయ్‌పూర్‌కు చెందిన ఎన్‌ఐఏ బృందం బీజాపూర్ జిల్లా భోపాల్‌పట్నం ప్రాంతం నుంచి మహిళా మావోయిస్టు మడకం ఉంగిని ఎన్ఐఏ అధికారులు కస్టడీకి తీసుకున్నారు.

2021 ఏప్రిల్ లో టేకులగూడెం సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మడకం ఉంగి నిందితురాలు. బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ టేకులగూడెం ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు వీరమరణం పొందగా, 30 మంది జవాన్లు గాయపడ్డారు. మడకం ఉంగి బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడతమల్ల గ్రామనివాసి.

Leave A Reply

Your email address will not be published.

Breaking