Take a fresh look at your lifestyle.

బీజేపీ గూటికి నవీన్ యాదవ్..?

0 18

బీజేపీ గూటికి నవీన్ యాదవ్..?
నిర్దేశం, హైదరాబాద్ :
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారతున్నాయి. హైదారాబాద్‌లో జూబ్లిహిల్స్ సీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అనూహ్య రీతిలో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డిని కాదని భారత మాజీ కెప్టెన్ అజారుద్దిన్ సీటు దక్కించుకున్నారు. అటు బీజేపీ నుంచి లంకెల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థిగా మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌ రంగంలోకి దిగారు. ఈ సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఎంఐఎం నేత నవీన్ యాదవ్‌ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది. తాజాగా స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్‌కు గాలం వేసింది భారతీయ జనతా పార్టీ. నవీన్‌ను బీజేపీలోకి చేర్చుకునేందకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంతనాలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. సుమారు 40 నిమిషాల పాటు కిషన్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ ఏకాంతంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి.. ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నేతలను కలుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే శ్రీశైలంను కలిసినట్లు తెలిపారు. ఇదే అంశంపై శ్రీశైలం యాదవ్ సైతం స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేవలం మర్యాదపూర్వకంగానే తమ ఇంటికి వచ్చారని వెల్లడించారు. అతిథిగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే తరహాలో మర్యాద చేస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking