Take a fresh look at your lifestyle.

పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

0 89

పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు

దుర్మార్గం, దౌర్జన్యం, అరాచకం కలిస్తే వైసీపీ అని విమర్శలు చేశారు జనసేన నేత, సినీ హీరో నాగబాబు. కర్నూలులో జనసైనికులతో నాగబాబు సమావేశం నిర్వహించారు. పొత్తులు కుదిరిన తర్వాతే ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయిస్తామని నాగబాబు వ్యాఖ్య నించారు.

వైసీపీ కూడా ఒక పార్టీయేనా అని జనసేన నేత  విమర్శించారు. దుర్మార్గం, దౌర్జన్యం, అరాచకం కలిస్తే వైసీపీ అని అన్నారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు పక్కా అనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై నాగబాబు స్పందిస్తూ…

పొత్తులు ఎవరితో ఉంటాయనే విషయాన్ని తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని చెప్పారు.

పొత్తులు కుదిరిన తర్వాతే ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

పొత్తుల విషయంలో ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నామనే విషయాన్ని పవన్ ప్రకటిస్తారని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking