Take a fresh look at your lifestyle.

ఎమ్మెల్సీలు పట్నం, కూనుకుంట్ల పై అనర్హత వేటు వేయాలి

0 18

ఎమ్మెల్సీలు పట్నం, కూనుకుంట్ల పై అనర్హత వేటు వేయాలి
– మండలి ఛైర్మన్ కు బీఆర్ఎస్ ఎల్పీ వినతి
నిర్దేశం, హైదరాబాద్ :
బీ ఆర్ ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి , కూసుకుంట్ల దామోదర్ రెడ్డి ల పై అనర్హత వేటు వేయాలని బీ. ఆర్. ఎస్ శాసన సభాపక్షం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి పిటిషన్ సమర్పించింది. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీలు ఎమ్ యస్ ప్రభాకర్ రావు , యాదవ రెడ్డి , శేరి శుభాష్ రెడ్డి, బీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం .రమేష్ రెడ్డి చైర్మన్ ను కలిసారు. పిటిషన్ తో పాటు పలు ఆధారాలను వాళ్లు సమర్పించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking