Take a fresh look at your lifestyle.

ఇక ముందు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ వుండిపోతారు

0 16

ఇక ముందు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ వుండిపోతారు
– కేసీఆర్ లో భయం కనిపిస్తోంది.
– కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమైంది.
– కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి
: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
నిర్దేశం, హైదరాబాద్ :
తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో అన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్ మేనిపెస్టోను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కేసీఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు ఆయన. కొద్ది రోజులుగా కేసీఆర్ కు భయం పట్టుకుందని, ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నదన్నారు ఖర్గే. మోదీ, కేసీఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ప్రజలు కూడా ఇప్పటికే డిసైడ్ అయి

 

పోయారన్నారు ఆయన.
ఇక ముందు ఫార్మ్ హౌస్ లోనే కేసీఆర్ ఉండి పోవాల్సిందన్నారు ఆయన. జనాలు బై బై కేసీఆర్.. టాటా కేసీఆర్ అంటున్నరన్నారు ఖర్గె. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు ఆయన. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే.. జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలు తున్నారని ఆయన విమర్శిచారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఇచ్చినట్టే ఇక్కడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు ఆయన. కర్ణాటకలో చెప్పిన ప్రతి హామీనీ మేం నెరవేరుస్తున్నాం. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను బరాబర్ అమలు చేసి తీరుతాం అన్నారు ఆయన. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేబినెట్ ఏర్పాటైన తొలి రోజే వాటిపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గె పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయశాంతి శుక్రవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను హోటల్ లో కలిశారు. ఆమెకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించారు ఖర్గే. విజయశాంతికి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking