Take a fresh look at your lifestyle.

కెసిఆర్ కుటుంబం తెలంగాణ కు పట్టిన శని : కేంద్ర మంత్రి

0 47

బషీర్ బాగ్ లో జరిగిన “ప్రజా గోస – బీజేపీ భరోసా”

స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ : ఎలాంటి హామీ లేకుండా ప్రధాని నరేంద్రమోదీ గారు ప్రతి పేదబిడ్డకు కేవలం ఆధార్ కార్డ్ తో అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు దీంతో 45 కోట్ల అకౌంట్లు దేశంలో ఓపెన్ చేసుకున్నారు పేదలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. డిల్లీ నుంచి రాష్ట్రాలకు 100 రూపాయలు పంపిస్తే పేదలకు 15 రూపాయలు మాత్రమే చేరేవని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానియే చెప్పారు ఇది నేను చెప్తుంది కాదు గతంలో రాజీవ్ గాంధీ గారే చెప్పారన్నారు ఆయన.

అందుకే దళారీ వ్యవస్థ, పేదవారిని దోపిడీ చేసే వ్యవస్థకు చరమగీతం పాడి ప్రతి పైసా నేరుగా సామాన్యులకు చేరాలని ప్రధాని మోడీ అకౌంట్ లు ఓపెన్ చేశారన్నారు రెడ్డి. కేంద్ర ప్రభుత్వం మోది సహాయం తో పక్కన ఉన్న ap లో లక్షల ఇళ్లు కడితే మన రాష్ట్రంలో వేల ఇళ్లు కూడా కట్టలేదన్నారు ఆయన. తెలంగాణ లో కేసీఆర్ పీడ విరగడ కావాలి అరాచక పాలన చేస్తున్న కెసిఆర్ కుటుంబం తెలంగాణ కు పట్టిన శని, శాపం అని విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వద్దని చెప్పినా కేసీఆర్ నేడు కల్వకుంట్ల కుటుంభ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారు కేసీఆర్ కుటుంభం నుంచి విముక్తి కావాలన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking