Take a fresh look at your lifestyle.

జర్నలిస్ట్ దాసరి చంద్రశేఖర్ మృతి పాత్రిక రంగానికి నష్టం.. -ప్రకాష్ రెడ్డి, చైర్మన్, మీడియా కమిటీ

0 50

జర్నలిస్ట్ దాసరి చంద్రశేఖర్ మృతి పాత్రిక రంగానికి నష్టం..
-ప్రకాష్ రెడ్డి, చైర్మన్, మీడియా కమిటీ
నిర్దేశం, విజయవాడ :
ప్రముఖ పాత్రికేయుడు దాసరి చంద్రశేఖర్ మంగళవారం మృతి చెందారు. సుధీర్ఘ కాలం పాత్రికేయ వృత్తిలో కొనసాగిన ఆయన తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పాత్రికేయుడిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు మీడియా కమిటీ చైర్మన్ ప్రకాష్ రెడ్డి. బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరు గ్రామానికి చెందిన దాసరి చంద్రశేఖర్ ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా పలు సంస్థల్లో పనిచేశారు.
పాత్రికేయుడిగానే కాకుండా పలు నాటకోత్సవాలకు వ్యాఖ్యాతగానూ ఆయన వ్యవహరించారు. అలాగే సినీ దర్శకుడిగా, కథా రచయిత గానూ పనిచేశారు. దాసరి చంద్రశేఖర్ మృతి పాత్రికేయ రంగానికి తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు ప్రకాష్ రెడ్డి.

Leave A Reply

Your email address will not be published.

Breaking