Take a fresh look at your lifestyle.

అంతర్జాతీయ సమావేశాలకు మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం

0 54

మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశాలకు

మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం

అమెరికాలో జరిగే ప్రపంచ పర్యావరణ & జలవనరుల సమావేశాల్లో కీలకోపన్యాసం చేయాలని అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నేతృత్వంలోని పర్యావరణ-నీటి వనరుల సంస్థ విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అవలంబించిన విధానాలతో పాటు తెలంగాణ సస్యశ్యామలంగా మారిన క్రమాన్ని వివరించాలని లేఖ రాసిన సంస్థ

ప్రపంచ పర్యావరణ & జలవనరుల సమావేశాల్లో కీలకోపన్యాసం చేయాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు,మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావును అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నేతృత్వంలోని పర్యావరణ-నీటి వనరుల సంస్థ (ASCE—EWRI) ఆహ్వానించింది.

అమెరికా హెండర్సన్ లో వచ్చే నెల మే నెల 21 -25 తేదీల మధ్య ఈ సమావేశాలు జరుగుతాయి.సరిగ్గా ఆరేళ్ల క్రితం 2017 మే 22 న అమెరికాలోని శాక్రమెంటోలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అప్పుడు ముఖ్యోపన్యాసం చేసిన కేటీఆర్,

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు,నీటి సంరక్షణ కార్యక్రమాలను వివరించారు.

ఈ భారీ నీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్దేశించిన సాహసోపేతమైన, ప్రతిష్టాత్మక లక్ష్యాలను ఆ నాటి సమావేశంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.

అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ పర్యావరణ-నీటి వనరుల సంస్థ (ASCE—EWRI) మేనేజింగ్ డైరెక్టర్ బ్రియాన్ పార్సన్స్ తో పాటు అధ్యక్షుడిగా ఎన్నికైన షిర్లీ క్లార్క్ నాయకత్వంలో ఓ ప్రతినిధి బృందం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించింది.

ప్రాజెక్టు పరిధి- సామర్థ్యం తో పాటు నిర్మాణంలో చూపించిన అద్భుతమైన వేగానికి ఆ ప్రతినిధి బృందం ఆశ్చర్యపోయింది.

ఇంతేకాదు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టిన పలు నీటి పారుదల ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రంలో కలిగిన సామాజిక, ఆర్థిక సమానత్వాన్ని ప్రశంసించింది. మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఆ ప్రతినిధి బృందం, ఒక బృహత్ సంకల్పాన్ని అతి తక్కువ సమయంలోనే వాస్తవంగా మార్చినందుకు అభినందనలు తెలియచేశారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking