Take a fresh look at your lifestyle.

రాళ్లు విసిరితే వాటితో ఇల్లు కట్టుకుంటా.. : గవర్నర్ తమిళిసై

0 16

దాడి చేస్తే రక్తంతో చరిత్ర రాసుకుంటా..

రాళ్లు విసిరితే వాటితో ఇల్లు కట్టుకుంటా..

  • గవర్నర్ తమిళిసై

నిర్దేశం, హైదరాబాద్ : తనపై రాళ్లతో దాడి చేస్తే ఆ రాళ్లతోటే ఇంటిని నిర్మించుకుంటానని, పిన్నులు విసిరితే అవి గుచ్చుకుని రక్తం వస్తే చరిత్ర రాసుకుంటానని గవర్నర్ తమిళిపై అన్నారు. రాజ్ భవన్ లో శనివారం మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన ధన్యవాద సభలో గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు ఫోటో కాల్ ఇచ్చినా.. ఇవ్వకున్నా పని చేసుకుంటూ పోతానని స్పష్టం చేశారు. తాను తెలంగాణ గవర్నర్ గా వచ్చినప్పుడు క్యాబినేట్ లో మహిళా మంత్రులు లేరని, తాను వచ్చిన వెంటనే ఇద్దరు మహిళా మంత్రులు ప్రమాణం చేయడం సంతోషకరమన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాన్ని తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఒకప్పుడు తాను బీజేపీ నేతనేనని, ఇప్పుడు గవర్నర్ అని పేర్కొన్నారు. అప్పట్లో బీజేపీలో 33 శాతం రిజర్వేషన్ ను మహిళలకు కల్పిస్తూ పార్టీ నిర్ణయించిందని, ఫలితంగా ఎంతో మంది మహిళలు పార్టీలో చేరారని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking