అంబేడ్కర్ ను అవమానిస్తే ఊరుకొం : కొరివి వేణుగోపాల్
కరీంనగర్ : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేడ్కర్ ను అవమానకరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రజమిత్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ హెచ్చరించారు. బుధవారం ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. అంబేడ్కర్ ను ఆయన రాసిన భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసలతో ముంచెత్తు తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల ప్రసాద్ అనే వ్యక్తి అంబేడ్కర్ గురించి అవమానకరంగా మాట్లాడారని అలాంటి వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రసాద్ లాంటి కుహనా గాల్ల వెనుక కొన్ని సంస్థలు ఇలా మాట్లాడించాయని పాలక ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం వాటి గుట్టును రట్టు చేయాలని కోరారు. ఈలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చట్టపరమైన కటిన చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 17న కరీంనగర్ పట్టణం కోర్టు చౌరస్తాలోనీ డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలతో అలంకరిస్తామని వివరించారు. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్య, అభ్యుదయ వాదులు, మేధావులు, కవులు, కళాకారులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బోయినిపల్లి చంద్రయ్య, సిహెచ్ రాం మూర్తి, డి ప్రణీత్, అనిల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.