Take a fresh look at your lifestyle.

పేదలకు జిఎస్ఆర్ ఫౌండేషన్ చేయూత

0 41

నిరుపేదలకు కొండంత అండ
డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం జిఎస్ఆర్ ఫౌండేషన్

మంచిర్యాల : చెన్నూరు నియోజకవర్గం లో నిరుపేద ప్రజలకు కొండంత అండగా నిలిచి నేను ఉన్నానంటూ వారి యొక్క కష్టాలను తెలుసుకుంటున్నారు  జిఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజా రమేష్ బాబు మిత్ర బృందం.

భీమారం మండలంలో నర్సింగాపూర్ గ్రామంలోని కొన్ని కాలనీలో నివసిస్తున్న తోట లక్ష్మి కొంత కాలం నుండి నిస్సహాయ స్థితిలో ఉంటూ ఎటువంటి సహాయం అందక బాధ పడుతుంది. అయితే..  ఆ కుటుంబం ఇబ్బందులను గ్రహించి డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం వారి ఇంటికి వెళ్ళి 50కేజీల బియ్యం మరియు నిత్యవసర వస్తువుల అందించారు. అలాగే  లక్ష్మి మనువరాలుకి చదువు కోవడంలో సహాయం చేస్తా నని చెప్పారు.
అలాగే అదే గ్రామానికి చెందిన మరో కుటుంబానికి 25 కిలోల బియ్యం మరియు నిత్యవసర సామాను అందించి అలాగే ప్రతి నెల వారికి బియ్యము నిత్యవసర సామాను అందిస్తామని గ్రామ పెద్దలకు మాట ఇవ్వడం జరిగింది.గొన్నారు. అలాగే నిరు పేద కుటంభీకులకు సహాయం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking