Take a fresh look at your lifestyle.

గీ ముచ్చట ఇన్నారుల్లా..

0 12

గీ ముచ్చట ఇన్నారుల్లా..
– పొలిటికల్ లీడరుల బాగోతం
– గాళ్లకు అస్కార్ అవార్డులు ఇవ్వచ్చు.
– ఎన్నికల్లో గెలువడానికి గిట్లాంటి పనులా..?
నిర్దేశం, హైదరాబాద్ :
ఓర్ని యవ్వ గీ ముచ్చట ఇన్నారుల్లా.. గీ ఎలక్షన్ లు వచ్చిన్నుంచి పాపం అధికార బీఆర్ ఎస్ అభ్యర్థులపై కాంగ్రెసోళ్లు దాడులు చేసి చితుక కొడుతుండ్రట. గాళ్ల పెయంత గాయలై ఇగో ఆగమాగం హైదరాబాద్ వచ్చి దవఖాండ్ల ట్రీట్ మెంట్ తీసుకుంటుండ్రట.. గిట్ల చేస్తే ఎట్లా..? గీ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరన్న పోటీ చేయచ్చు. గీ బీఆర్ఎస్ గాళ్లు పోటీ చేస్తే పట్టుకుని తన్నుడేంది..?
గీ ముచ్చటేందంటే..
ఇగో గీ ముచ్చట అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గురించి చెబుతున్న. బాలురాజు బీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు గదా. శనివారం రాత్రి అచ్చంపేట ఎలక్షన్ ప్రచారంకు పోయిండంట. గాడ గీయన కోసం కాపల కాసిన కాంగ్రెసోళ్లు బాలురాజును పట్టుకుని మత్తు తన్నిండ్రట. గాళ్లు కొట్టంగానే మొఖం మీద మత్తు దెబ్బలు కనబడ్డాయట. ఇగో గాయన భార్య మొగాణ్ణి తీసుకుని హైదరాబాద్ తీసుకొచ్చి అపోల్లో హాస్పిటల్ లో జయిన్ చేసిండ్రట..
బాలురాజును చూసి బాధ పడ్డ మంత్రులు
బాలురాజును కాంగ్రెసోళ్లు తన్నిన ముచ్చట తెలుసుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు బీఆర్ ఎస్ లీడరులు మత్తు మంది అపోలో ఆసుపత్రికి వచ్చిండ్రు. బాలురాజుకు మత్తు ధైర్యం చెప్పిన గా మంత్రులు కాంగ్రెసోళ్లను పొట్టు పొట్టు తిట్టిండ్రట.


ఇజ్జత్ తీసుకుంటుండ్రు..
ఇగో.. గీ బాలురాజు ముచ్చటపై సోషల్ మీడియాలో మస్తూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. దవఖాండ్ల బెడ్ మీద ఉన్నప్పుడు మంత్రలు వచ్చి మాట్లాడినప్పటి బాలురాజు ఫోటో.. డిశ్చార్జి తరువాత చెంపకు గాయమైనట్లు బ్యాండెజ్ వేసిన ఫోటో చూసి జనం నవ్వుకుంటుండ్రు. ఎన్నికల్లో గెలువడానికి గింత గాలిజ్ పనులు చేత్తే ఎట్లా..? అంటూ పొట్టు పొట్టు తిడుతుండ్రు కాంగ్రెసోళ్లు.
గెలువడానికి గీ డ్రామలాడుతుండ్రు..
గీ డ్రామాలన్నీ బీఆర్ ఎసోళ్లే ఎందుకు ఆడుతుండ్రని జనం మాట్లాడుకుట్టుండ్రు. గిప్పుడు గవర్నమెంట్ కు వ్యతిరేకంగా గాలి వీస్తుందట.. కాంగ్రెసోళ్లు గీ ఎన్నికల్లో గెలిచెటట్లు ఉన్నారని గీ డ్రామాలాడుతుండ్రని పొలిటికల్ గురించి తెలిసినోళ్లు అనుకుంటుండ్రు. వైజాక్ లో జగన్ పై కోడి కత్తి, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ కాలుకి గాయం, మొన్న కొత్త ప్రభాకర రెడ్డిపై కత్తి గాయం, గిప్పుడెమో గువ్వల బాలరాజుపై దాడి గివన్నీ ప్రశాంత్ కిషోర్ సెంటిమెంట్ డ్రామాలేనని కాంగ్రెసోళ్లు అంటుండ్రు.ఇదంతా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ డైరెక్షనే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. విశాఖలో వైఎస్ జగన్‌పై కోడికత్తి అంశం, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ కాలుకి గాయం, మొన్న కొత్త ప్రభాకర రెడ్డిపై కత్తి గాయం, తాజాగా గువ్వల బాలరాజుపై దాడి ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ వేస్తున్న సెంటిమెంట్ డ్రామాలే అని కాంగ్రెస్ అంటోంది.
– వయ్యామ్మెస్ ఉదయశ్రీ

Leave A Reply

Your email address will not be published.

Breaking