Take a fresh look at your lifestyle.

పలువురికి నివాళులర్పించిన మాజీ మంత్రి జూపల్లి

0 44

పలువురికి నివాళులర్పించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్ కర్నూల్ : కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16 మరియు 3 వ వార్డులకు చెందిన పలువురు అనారోగ్యంతో మరియు యాక్సిడెంట్ లో మృతి చెందిన పలువురిని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నేటి ఉదయం ఆయా నివాసాలకు వెళ్లి వారి భౌతిక కాయలకు పూల మాలవేసి నివాళులర్పించారు.

కొల్లాపూర్ పట్టణ 16 వ వార్డుకు చెందిన జూపల్లి అనుచరులు డ్రైవర్ సురేష్ మాతృమూర్తి మాండ్ల శాంతమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు నేటి తెల్లవారుజామున మృతి చెందారు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నాయకులతో కలిసి వారి నివాసానికి వెళ్లి వారి భౌతిక కాయనికి పూలమాల వేసి నివాళులర్పించారు.మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయిపల్లి 3 వార్డుకు చెందిన బండారి బాలమ్మ నిన్న పెద్దకొత్తపల్లి మండల పరిధిలోని అధిరాల దగ్గర ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందారు విషయం తెలుసుకున్న జూపల్లి వారి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం సానుభూతి వ్యక్తం చేశారు వారితోపాటు మండల మరియు వివిద వార్డుల కౌన్సిలర్ లు జూపల్లి అనుచరులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking