Take a fresh look at your lifestyle.

మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం

0 137

ఒక కెమోరా వంద మంది పోలీసులతో సమానం.. ఔను.. నిజమే.. చట్ట విరుద్దంగా వ్యవహరించిన వాళ్లను సాక్ష్యాలతో పట్టిస్తోంది. అయినా.. దొంగలు దర్జాగా దోచుకుంటున్నారు.

ఇగో..  మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది.

మూడు చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలోని వైన్ షాప్ వద్ద గుర్తు తెలియని దుండగులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం వైన్స్ సిబ్బందిని బెదిరించి రూ. రెండు లక్షలు ఎత్తుకెళ్లారు.

దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనకు కారణమైన నిందితులను గాలించే పనిలో పడ్డారు పోలీసులు. కాగా ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. నిందితులను గుర్తించడానికి పోలీసులు సీసీ కెమోరాలను పరిశీలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking