Take a fresh look at your lifestyle.

నాలుగు రైళ్ల గమ్యస్థానం పొడిగింపు.. : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

0 13

నాలుగు రైళ్ల గమ్యస్థానం పొడిగింపు
జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
నిర్దేశం, సికింద్రాబాద్ :
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కాజిపేట-హడప్సర్ (పుణే) రైలును కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  జి.కిషన్ రెడ్డి సోమవారం ఉదయం జెండా ఊపి ప్రారంభించారు. దీంతోపాటుగా మరో మూడు రైళ్లను వర్చువల్ గా ప్రారంభించారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే  నాల్గు రైళ్ళను పొడిగించింది.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ మరోసారి సాహసోపేతమైనా నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రైళ్ల పొడగింపుతో పురోగతి సాధించింది. వేల కోట్ల రూపాయల వ్యయంతో కొత్త ప్రాజెక్ట్స్ నిర్మాణం జరుగుతున్నాయి.

హడప్సర్ -హైదరాబాద్ ఎక్స్ ప్రెస్  కాజీపేట వరకు,    జైపూర్ – కాచిగూడ ఎక్స్ ప్రెస్ ను కర్నూల్ పట్టణం వరకు,   నాందేడ్ – తాండూర్ ఎక్ష్ప్రెస్స్ ను రాయచుర్ వరకు,   కరీంనగర్ – నిజామాబాదు ప్యాసింజర్ ను బోధన్ వరకు పోడిగించారు. తెలుగు రాష్టలలోని, వివిధ ప్రాంతాలలో రైళ్ల సర్వీస్ లో పొడగింపు, అదనపు ప్రయాణ సౌకర్యాలతో ప్రజల అవసరాలు తీరానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking