Take a fresh look at your lifestyle.

ముదిరాజ్ లు కాంగ్రెస్ కు ఓటు వేసి బీఆర్ ఎస్ కు బుద్ది చెప్పాలి : గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్

0 45

ముదిరాజ్ లు కాంగ్రెస్ కు ఓటు వేసి
బీఆర్ ఎస్ కు బుద్ది చెప్పాలి : గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్
నిర్దేశం, మహబూబాబాద్:
అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ ఎస్, బీజేపీ ముదిరాజ్ లను నిర్లక్ష్యం చేసినందున కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముదిరాజ్ ల సమస్యలను పరిష్కరిస్తామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామి ఇచ్చారన్నారు ఆయన. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ముదిరాజ్ లను బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చుతమని రేవంత్ రెడ్డి హామి ఇచ్చారన్నారు ఆయన. ఆరువై లక్షల మంది జనాభ ఉన్న ముదిరాజ్ లకు బీఆర్ ఎస్ ప్రభుత్వం ఒక్క సీటు కూడా ఇవ్వక పోవడం దుర్మార్గమన్నారు ఆయన. అగ్రవర్ణాలకు అధికంగా సీట్లు ఇచ్చిన బీఆర్ ఎస్ అత్యధికంగా జనాభ గల ముదిరాజ్ లకు సీట్లు ఇవ్వకుండా అవమాన పరిచారన్నారు గొడుగు శ్రీనివాస్. ఒకవైపు ముదిరాజ్ లకు అన్యాయం చేసిన బీఆర్ ఎస్ లో ముదిరాజ్ సంఘం అగ్రనేత కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ ఎస్ లో చేరడం దురదృష్టకరమన్నారు ఆయన.
ఎన్నికల ప్రచారంలో గొడుగు..
మహబూబాబాద్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడానికి ముదిరాజ్ లు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో ముదిరాజ్ మత్స్యకార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు తీసుకువచ్చినట్లు తెలిపారు ఆయన. ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం జిల్లా కార్యదర్శి తురక గోపాల్ ముదిరాజు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking