Take a fresh look at your lifestyle.

అప్పుల్లో మునిగిన ట్రాన్స్ కో- జెన్ కో లు

0 52

అప్పుల్లో మునిగిన ట్రాన్స్ కో, జెన్ కో లు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

మహబూబాబాద్ : అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి యాత్రలో పాల్గొనలేక పోతున్నారని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం అయన లచ్చతండా లో మీడియాతో మాట్లాడారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఆయన సోదరుడు ఇల్లందులో కాంగ్రెస్ ను గెలిపించారు. ప్రజలు కేసీఆర్ కు ఇచ్చిన అవకాశం ముగిసింది. పది బడ్జెట్ లలో 23 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు.

ఒక్కో నియోజకవర్గానికి 20వేల కోట్లు ఖర్చు చేయాలి. మరి ఇల్లందు నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారు. రూ.5వేల కోట్లు ఫీజు రీయబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ లో 800 కోట్ల బకాయిలు ఉన్నాయని అన్నారు.
2003 కు ముందు విద్యుత్ కోతలు ఉన్నట్లే.. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి.

ఆనాడు ఎదుర్కున్నట్లుగానే ఈనాడు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నాం. ఆనాడు బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమంతో ప్రభుత్వం కుప్పకూలింది. సాధ్యం కాదన్న ఉచిత విద్యుత్ ను కాంగ్రెస్ అమలు చేసి చూపిందని అన్నారు.
రైతులకు అనుకూలమైన విధానాన్ని కాంగ్రెస్ తీసుకొచ్చింది. రైతులకు 24 గంటల విద్యుత్ పై కేసీఆర్ ఆడంబరపు ప్రకటనలు ఇచ్చారు.

ప్రయివేటు విద్యుత్ సంస్థల్లో 50శాతం కమీషన్లు దండుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 20వేల కోట్ల బకాయి పడింది. ట్రాన్స్ కో, జెన్ కో కలిపి 60వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయాయి. కేసీఆర్ ధన దాహంతోనే ఈ పరిస్థితి. విద్యుత్ కొనుగోళ్ళల్లో వేల కోట్ల కుంభకోణం జరిగింది. ఏపీలో మిగులు విద్యుత్ తక్కువ ధరకే సరఫరా చేస్తామన్నా కేసీఆర్ సుముఖత చూపలేదు. కమీషన్లు, కాసుల కక్కుర్తి కోసమే తన నమ్మిన బంట్ల వద్ద కొనుగోలు చేశారని అన్నారు.

ఛత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందంలో లోపభూయిష్టం ఉందని గతంలో ఉద్యోగి రఘు ఫిర్యాదు చేశారు. దీన్ని ఒప్పుకోని అధికారిని కేసీఆర్ బదిలీ చేశారు. గుజరాత్ కంపెనీతో వెయ్యి కోట్లు లంచం తీసుకుని కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టె క్నాలజీని కొన్నారు. దాదాపు 10వేల కోట్లు అప్పు భారం జెన్ కో, ట్రాన్స్ కో మీద పెట్టారు. యాదాద్రి పవర్ ప్లాంట్ టెండర్ లేకుండా బీహెచ్ఈఎల్ కు అప్పగించారు. సివిల్ వర్క్ ను సొంత కాంట్రాక్టర్లకు ఇప్పించి వేల కోట్లు దోచుకున్నారు. తొమ్మిదేళ్లయినా యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి చేయలేదని అన్నారు.

10వేల కోట్లు భద్రాద్రి కోసం..35వేల యాదాద్రి కోసం అప్పు తెచ్చారు. స్థాయి , అనుభవం లేని అధికారులకు బాధ్యతలు అప్పగించారు. చిన్న ఉద్యోగాలు చేసి, రిటైర్ అయిన ప్రభాకర్ రావును జెన్ కో కు సీ ఎండీగా నియమించారు. దోపీడికి సహకరించిన ప్రభాకర్ రావుకు, రఘుమా రెడ్డికి ఉన్నతమైన బాధ్యతలు అప్పగించారుని అన్నారు. కేసీఆర్ దోపిడీ వల్లే విద్యుత్ సంస్థలు కుప్పకూలిపోయాయి. రైతులు తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటున్నారు. 2014 నుంచి జరిగిన విద్యుత్ కొనుగొల్లపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 20వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి. ఎవరూ ఏసీడీ చార్జీలు కట్టవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ వైఖరిపై నిరసనలు తెలపండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏసీడీ చార్జీలు రద్దు చేస్తుంది. రైతు సంఘాలు, రైతులు అందరం రోడ్డెక్కుదామని పిలుపునిచ్చారు.

బషీర్ బాగ్ ఉద్యమం లాంటి మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉంది. మొదటి దశలో రోడ్డెక్కి నిరసన, ఆ తరువాత సబ్ స్టేషన్ల ముట్టడిస్తాం. ఈఆర్సీ సరైన నిర్ణయం తీసుకోకపోతే విద్యుత్ సౌధను ముట్టడిస్తాం. ఈ దోపిడీ లబ్ధిదారులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కమ్యూనిస్టులు దోపీడీదారుల పక్షాన ఉంటారో… ప్రజల పక్షాన కొట్లాడుతారో నిర్ణయించుకోవాలని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking