Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి

0 13

గర్భస్త శిశువు మృతి

బంధువుల అందోళన

సంగారెడ్డి, ఏప్రిల్ 22 : సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం నెలకొంది. ఈ నెల 20న పురిటి నొప్పులతో గర్భిణి రేణుక డెలివరీ కోసం వచ్చింది. నార్మల్ డెలివరీ చేస్తామని ఆపరేషన్ చేయలేదు. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి  రేణుక ఆరోగ్యం విషమించింది. రేణుక పరిస్థితి విషమించడంతో  డాక్టర్లు శిశువుని బయటకు తీసారు.

అప్పటికే మగ శిశువు మృతి చెందడంతో బంధువులు అందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాబు చనిపోయాడని  ఆరోపించారు. విషమంగా రేణుక పరిస్థితి వుంది. ఐసీయూలో  చికిత్స  చేస్తున్నారు. ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking