Take a fresh look at your lifestyle.

తండ్రి కడసారి చూపుల కోసం అమెరికా నుంచి వచ్చిన పిల్లలు

0 23

అంత్యక్రియాలకు సహకరించిన

అనూస్ అపార్ట్ మెంట్ వాసులు

పల్లెటూర్ లో మనిషి మరణిస్తే అందరూ ఆ అంత్యక్రియాలకు హాజరైతారు. ఆ పల్లెటూరి ప్రేమలే వేరు. అందుకే ఓ కవి పల్లెను తల్లి అన్నాడు. పట్టణాన్ని ప్రియురాలు అన్నాడు. అది నిజమేనెమో..? ఇగో.. అపార్ట్ మెంట్ లో మనిషి మరణిస్తే కూడా పక్క ఇంటి వాళ్లకు తెలియని పరిస్థితి కదా..

కానీ.. హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ అనూష్ అపార్ట్ మెంట్ వాసులు మాత్రం కష్టాలలో.. బాధలలో.. సంతోషాలలో అందరూ షేర్ చేసుకుంటారు.

ఇగో.. అపార్ట్ మెంట్ లో వెంకటిపతి రాజు (84) మరణించారు. అతని కుమారుడు, కూతురు ఇద్దరూ అమెరికాలో ఉంటారు. అయినా.. కన్నతండ్రిని కడసారి చూపులు చూస్తామని పిల్లలు చెప్పడంతో మరణించిన రాజు బాడిని మల్లారెడ్డి ఆసుపత్రిలో ఉంచారు.

బుధవారం తెల్లవారు జామున రాజు పిల్లలు అమెరికా నుంచి రావడంతో వెంకటిపతి రాజు బాడిని  అపార్ట్ మెంట్ కు తెచ్చారు. కాకినాడకు చెందిన రాజు అంత్యక్రియాలను ఆ అపార్ట్ మెంట్ వాసులు దగ్గర ఉండి సహాయం చేశారు.  కన్నీటి వీడ్కొల్ పలికారు. కళ్ల ముందు తిరిగే ఆ పెద్దాయన  లేడనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు.

అంత్యక్రియలు

  • యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

Leave A Reply

Your email address will not be published.

Breaking