కడియంపై గులాబీనేతల ఫైర్
నిర్దేశం, వరంగల్ :
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓ చీడ పురుగు అని వరంగల్ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వరంగల్లో మీడియా సమావేశం పెట్టిన బీఆర్ఎస్ నేతలు కిడయంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి పదేండ్ల కాలంలో ఎన్నో పదవులు అనుభవించారని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆ గౌరవం కేసీఆర్ కల్పించారన్నారు. శనివారం స్టేషన్ ఘన్పూర్లో మీటింగ్ పెడుతున్నాం. మీరు లేనప్పుడే స్టేషన్ ఘన్పూర్లో కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగిరింది. ఆనాటి టీఆర్ఎస్లో మీకు చావుదెబ్బ తగిలింది. 2001లో పార్టీ పుట్టినప్పుడే అన్ని మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు గెలిచాం.
గులాబీ కోటలో చీడ పురుగుల్లా వచ్చి.. కోటను నాశనం చేసేందుకు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. శనివారం స్టేషన్ ఘన్పూర్ మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. అందరూ కేసీఆర్ వెంటే ఉంటారు అని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. పదేండ్ల కాలంలో ఏ ఒక్క రోజు కూడా కడియం ఖాళీ లేరు. ఉప ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్సీ, ఎంపీగా అవకాశం ఇచ్చారు కేసీఆర్. పార్టీ నాయకులు అహర్నిశలు కష్టపడి, పని చేసి ఎంపీగా గెలిపించారు. ఇతర నాయకులు మీ కోసం ఎంతో త్యాగం చేశారు. ఆత్మ విమర్శ చేసుకోవాలి. మీరు టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు మీతో పది మంది కూడా రాలేదు. ఇవాళ మీతో పది మంది కూడా రారు. నిత్యం విలువల గురించి మాట్లాడటం బంద్ పెట్టాలి. మీరే పునీతులు అని ఇతరులు అపవిత్రలు అనే మాటలు ఇక చెల్లవు అని కడియం శ్రీహరిని పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.