Take a fresh look at your lifestyle.

మారిన చిన జీయర్ స్వామి

0 13

మారిన చిన జీయర్ స్వామి

చిన జీయర్ స్వామి.. అతనికి అభిమానుల సంఖ్య ఎక్కువే.. బీఆర్ ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ – చిన జీయర్ స్వామి ఒకప్పుడు ఫెవిక్ లా అతుక్కుని తిరిగే వారు. చిన జీయర్ స్వామి సలహా, సూచనలతోనే యాదగిరి గుట్ట పేరును యాదాద్రి గా పేరు మార్చారనే టాక్. చిన జీయర్ స్వామి నిర్మాణం చేసిన సమత మూర్తి విగ్రహాప్రతిష్ఠాపన సందర్భంగా దేశ ప్రధాని మోదీని ఆహ్వనించడంతో ఈ ఇద్దరి ఫెవికల్ బంధం బద్దలైంది.
సో.. అప్పటి నుంచి మాటలు కూడా ఇద్దరి మధ్య లేకుండా పోయాయి. కానీ.. రాష్ట్రంలో రాజకీయాలు మారి పోవడం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి అయ్యారు. అంతే.. సోమవారం చిన జీయర్ స్వామి సీఎం రేవంత్ రెడ్డిని అతని గృహంలో కలిసి పూల బోకే ఇచ్చి సన్మానించారు.
ఔను.. స్వాములు.. పాలకులు మారుతున్న కాలంలో వాళ్లు మారుతునే ఉంటారు కదూ..

Leave A Reply

Your email address will not be published.

Breaking