Take a fresh look at your lifestyle.

బీఆర్ ఎస్ ఎమ్మెల్యే దుర్మరణం

0 12

బీఆర్ ఎస్ ఎమ్మెల్యే దుర్మరణం

నిర్దేశం, హైదరాబాద్ : కంటోన్మెంట్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (37) దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు వద్ద ఔటర్ రింగ్ రోడు మీద ఆమె ప్రయాణిస్తున్న కారు శుక్రవారం ఉదయం 5.15 గంటలకు అదుపు తప్పి గుర్తు తెలియని వాహనాన్ని, ఆ తరువాత రేయిలింగ్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొన ఊపీరితో ఉన్న లాస్య నందితను హాస్పిటల్ కు తీసుకెళ్లుతుండగా మార్గమధ్యలో మరణించారు. డ్రైవర్ ఆకాష్ కు రెండు కాళ్లు విరిగాయి. ప్రమాదానికి అతివేగం కారణమని సంగారెడ్డి అడిషనల్ ఎస్ పీ సంజీవ రావు తెలిపారు. లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు మేరకు డ్రైవర్ ఆకాష్ మీద కేసు నమోదు చేశారు. లాస్య భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. సాయంత్రం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

వరుస ప్రమాదాలు..

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికైన అనతి కాలంలోనే రెండు ప్రమాదాల నుంచి బయట పడి మూడో ప్రమాదంలో మరణించారు. లిప్ట్ లో మూడు గంటలు ఇరుక్కున్నారు. ఇటీవల నల్గొండలో జరిగిన కేసీఆర్ సభకు వెళ్లి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హోం గార్డు మరణించగా, లాస్య నందిత స్వల్ప గాయాలతో బయట పడ్డారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking