Take a fresh look at your lifestyle.

బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ దేశానికి ప్రమాదం..

0 11

బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ దేశానికి ప్రమాదం..
– తెలంగాణను కేసీఆర్ ఫ్యామిలీ లక్షా కోట్లు దోచుకుంది,
– ప్రజల తెలంగాణ ఇస్తే.. దొరల తెలంగాణగా మార్చారు.
– కేసీఆర్ చదివిన స్కూల్ మా కాంగ్రెస్ నిర్మించిందే..
– హైదరాబాద్ లో ఐటీ కారిడర్ మా ప్రభుతం నిర్మించింది.
: వరంగల్ విజయభేరి పాదయాత్రలో రాహుల్ గాంధీ
నిర్దేశం, వరంగల్ :
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ నగరంలో విజయభేరి యాత్రలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. రోడ్ వెంట ప్రజలను పలుకరిస్తూ ముందుకు సాగారు. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు కార్యకర్తలు. పోచమ్మ మైదాన్ జంక్షన్ లో కార్నర్ మీటింగ్ లో రాహుల్ మాట్లాడారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ కల నెరవెరలేదన్నారు ఆయన. ప్రజల తెలంగాణకు బదులుగా దొరల తెలంగాణగా కేసీఆర్ మార్చి కోట్లు దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్. మూడేండ్లకే కాళేశ్వర్ ప్రాజెక్ట్ కుంగి పోవడానికి అవినీతి కారణమన్నారు ఆయన.
కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు.. అతను చదివిన స్కూల్, కాలేజ్ కూడా కాంగ్రెస్ పార్టీ నిర్మించిందన్నారు రాహుల్ గాంధీ. హైదరాబాద్ లో ఐటీ కారిడర్ నిర్మాణం చేసిన ఘనట కాంగ్రెస్ దే అన్నారు ఆయన. ప్రభుత్వ పథకలలో కూడా 30 శాతం కమీషన్ లు తీసుకుంటున్నారని ఆరోపించారు రాహుల్.

కేసీఆర్ ఓట్ల కోసం ఆబద్దాలు మాట్లాడుతున్నారన్నారు ఆయన. రైతులకు 24 గంటలు విద్యుత్ అంద చేస్తామని ఆయన ప్రకటించారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ ఎస్ మూడు ఒక్కటేనన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో తాము పోటీ చేసిన వద్దనే ఎంఐఎంతో బీజేపీ పోటీ చేయిస్తుందన్నారు ఆయన. బీఆర్ ఎస్ ఎంపీలు కూడా ప్రధాని మోదీ కనుసైగలతో ఉండేవారని గుర్తు చేశారు రాహుల్. దేశానికి ఆర్ ఎస్ఎస్, బీజేపీ ప్రమాదం అని పేర్కొన్నారు ఆయన. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నయన్నారు ఆయన. తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, వాళ్లంతా బీఆర్ ఎస్ కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు రాహుల్. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే క్యాబినెట్ లో ఆరు గ్యారంటీ పథకాలపై మొదటి సంతకం చేస్తామన్నారు ఆయన. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు కొండ మురళి, కొండ సురేఖ మాట్లాడారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking