Take a fresh look at your lifestyle.

లోకేష్, పోలీసుల మధ్య వాగ్వాదం

0 49

లోకేష్, పోలీసుల మధ్య వాగ్వాదం

తిరుపతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర గాజుల మంద్యం వద్ద గురువారం ప్రారంభం అయింది. అయనకు స్థానిక తెలుగుదేశం నాయకులు ప్రజలు భారీగా చేరుకొని క్రేన్ సహాయం ద్వారా గజమాలను వేసారు.

అనంతరం ప్రసంగిస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ కు ఎస్సై కు మధ్య వివాదం చెలరేగింది. ఎలక్షన్ కోడ్ ఉన్నందున లోకేష్, తెలుగుదేశం నాయకులను ఇక్కడి నుండి త్వరగా వెళ్లాలంటూ పోలీసులు సూచించారు.

నారా లోకేష్ ఎస్ఐ తో మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ లో మా పాదయాత్ర నే గుర్తుందా. మా వాళ్ల పైనే దాడులు జరుగుతాయి అంటూ వాదించుకున్నారు.ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తగ్గేదే లేదంటూ ముందుకు సాగారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking