Take a fresh look at your lifestyle.

తెలంగాణ ఆడబిడ్డ కవితమ్మపై ఇంత కోపమా..? : మంత్రి

0 148

తెలంగాణ ఆడబిడ్డ కవితమ్మపై ఇంత కోపమా..?

: మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఢిల్లీ, మార్చి 21 : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆడబిడ్డ కవితమ్మను, బాధ్యతగల వ్యక్తిగా ఆడబిడ్డ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.  ఈడీ అధికారులు అడిగిన వెంటనే సెల్ ఫోన్ లు కవిత తీసుకెళుతుందన్నారు ఆయన. సెల్ ఫోన్ లను ఈడి అధికారులకు స్వాధీనం చేసినందున కిషన్ రెడ్డి ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు.

తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన కవితను బాధ పెట్టడం సరి కాదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.కేసీఆర్ ను ఎదిరించలేక ఇలా ఇబ్బందులు పెడుతున్నారన్నారు ఆయన. దేశంమీద గౌరవం ఉంటే… దేశాన్ని దోచుకునే వాళ్ళను ఢిల్లీ గడ్డపై ఉరితీయండన్నారు ఆయన.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking