Take a fresh look at your lifestyle.

అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం

0 44

అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం

సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం లో గల శ్రీ అభయాంజనేయ స్వామి 20వ వార్షికోత్సవం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం భక్త జన సమూహం లో కనుల పండువగా నిర్వహించారు. భక్తులు ఉదయం నుండి శ్రీ అభయాంజనేయ స్వామి దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని మాట్లాడుతూ, ఆంజనేయస్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కళ్యాణోత్సవాలు ప్రజల్లో ఆధ్యాత్మిక భావం, స్నేహ భావాలు, శాంతి సామరస్యాలు పెంచుతాయన్నారు. గత 20 ఏళ్లుగా వైభవంగా వార్షికోత్సవం నిర్వహిస్తున్న కమిటీ వారిని అభినందించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామనన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శాంతి కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు.

అంతకు ముందు స్వామి వారికి మన్యుసూక్త విధానంతో తొమ్మిది రకాల పండ్ల రసాలతో అభిషేకాలు, గణపతి పూజ, హనుమాన్ హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. కాగా వార్షికోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు.

ఈ వేడుకల్లో ఎంపీపీ చింతా కవిత రాధా రెడ్డి, కౌన్సిలర్లు కందుల చంద్రశేఖర్ ,కందుల కోటేశ్వరరావు , నాగేశ్వరరావు ,చిత్తలూరి ముత్తయ్య ,కందుల వెంకట నరసయ్య ,వనపర్తి భద్రయ్య ,పోలిశెట్టి రాము, గ్రామ పురోహితులు జొన్న బట్ల వెంకట నాగేంద్ర శాస్త్రి, దేవాలయ అర్చకులు ఉండ్రుగొండ శ్రీనివాసాచార్యులు ,ప్రవీణ్ ఆచార్యులు పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహించారు . కోదాడ పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking