Take a fresh look at your lifestyle.

మహాజాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ ఆరు వేల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు

0 16

మహాజాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ ఆరు వేల ఆర్టీసీ బస్సులు ఏర్పాటు
నిర్దేశం, హైదరాబాద్ :
తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈసారి ఏకంగా 51 సెంటర్ల నుంచి ఆరు వేలకు పైగా బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 51 సెంటర్ల నుంచి మేడారం ప్రత్యేక బస్సులు నడిపించనున్నారు. అందులో ఉమ్మడి వరంగల్ లోనే 22 సెంటర్లుండగా.. వరంగల్ నగరంలోని మూడు ప్రాంతాల నుంచి బస్సులు నడపనున్నారు. ఈ మేరకు మేడారం జాతరకు రాకపోకలు సాగించేందుకు ఆర్టీసీ అధికారులు ఛార్జీలు కూడా నిర్ణయించారు. ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మీ స్కీం మేరకు మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నారు. ఇక పురుషుల కోసం ఆర్టీసీ అధికారులు ఛార్జీలు విడుదల చేశారు. అధికారులు విడుదల చేసిన మేరకు బస్సులు నడిపే సెంటర్, కిలోమీటర్లు, పెద్దలు, చిన్నారులకు సంబంధించిన ఛార్జీల వివరాలు ఇలా ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking